అశ్వినీ దత్ గారి నిర్మాణంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను: శ్రీను & మంగా ఈవెంట్ లో హీరో జయకృష్ణ ఘట్టమనేని ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ హీరోగా పరిచయమౌతున్న జయకృష్ణ ఘట్టమనేని ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. విజువల్గా అద్భుతమైన, వైలెంట్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ…
Category: Entertainment
ఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం
ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగాఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం బొకేతో, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ “ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీలో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము’ అని తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూర్తిగా సానుకూలంగా ఉన్నారని భరత్ భూషణ్ తెలిపారు. చైర్మన్ భరత్…
జూన్లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్ఫామ్గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్ఫామ్గా విహారి OTT జూన్లో గ్రాండ్గా ప్రారంభం కానుంది.
మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం
నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…
మరికొన్ని గంటల్లో బాలయ్య ‘అఖండ 2’ ప్రీమియర్స్.. నిర్మాతల కీలక ప్రకటన
అన్నీ అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు బాలకృష్ణ ‘అఖండ 2 తాండవం’ రిలీజ్ కాబోతుంది. శుక్రవారం (డిసెంబర్ 12)న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ్టి రాత్రి (డిసెంబర్ 11) నుంచే ‘అఖండ 2 తాండవం’ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. దీంతో బాలయ్య మూవీ ఫస్ట్ షో చూడాలని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. రేటుతో సంబంధం లేకుండా ఇప్పటికే చాలా మంది ప్రీమియర్స్ టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే బాలయ్య సినిమా రిలీజ్ పై రూమర్లు మాత్రం ఆగడం లేదు. డిసెంబర్ 5నే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. చిత్ర నిర్మాతలకు ఫైనాన్సియల్ ఇష్యూస్ ఉండడంతో ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడీ సమస్యలన్నీ తీరిపోయాయని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. శుక్రవారం…
అవాస్తవాల్ని నమ్మకండి.. అసత్యాల్ని ప్రచారం చేయకండి : ‘శశివదనే’ హీరోయిన్ కోమలి ప్రసాద్
కోమలి ప్రసాద్ నటిగా తెలుగు తెరపై తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ‘శశివదనే’ చిత్రంతో తెరపైకి రాబోతోన్నారు. ఈలోపు కోమలి ప్రసాద్ మీద సోషల్ మీడియాలో ఓ అసత్య ప్రచారం మొదలైంది. యాక్టింగ్ కెరీర్ను వదిలి పెట్టారని, డాక్టర్ వృత్తిలోకి వెళ్లారని ఆమె మీద రూమర్లు క్రియేట్ చేశారు. దీంతో ఈ వార్తల్ని ఖండిస్తూ కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ వేశారు. ‘అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అయ్యానని, నటనకు పూర్తిగా దూరం అయ్యానంటూ అసత్య ప్రచారాలు, తప్పుదోవ పట్టించే వార్తల్ని ప్రచురిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ రూమర్లను నిజం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని అందరికీ స్పష్టంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎంతో…
Sensational Director V.V. Vinayak Launches the Teaser of Thank You Dear
The teaser of the upcoming film Thank You Dear was officially launched by sensational filmmaker V.V. Vinayak, generating excitement among audiences and industry circles alike. The film is being produced by Pappu Balaji Reddy under the banner of Mahalakshmi Productions and is directed and written by Thota Srikanth Kumar. The movie features Dhanush Raghumudri, Hebah Patel, and Rekha Nirosha in the lead roles, with a strong supporting cast including Veera Shankar, Nag Mahesh, Ravi Prakash, Chatrapathi Sekhar, Balagam Sujatha, and Sankranthi fame Srinivas Naidu. Music for the film is composed…
సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం
వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారి కృషికి మంచి గుర్తింపు ఇవ్వాలనే ప్రయత్నంతో విజన్ స్టూడియోస్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పేరుతో అవార్డ్స్ అందించారు. సినీ, విద్యా, వైద్యం, రియల్ ఎస్టేట్..ఇలా పలు రంగాల్లో ఈ అవార్డ్స్ అందించారు. విజన్ స్టూడియోస్ వారు మొదటి సారిగా నిర్వహించిన ఈ అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ – రమేష్ కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. పట్టుదలతో కష్టపడే తత్వం కలవాడు. ఆయన విజన్…
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ గ్రోసరీ స్టోర్ ప్రారంభం
మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా… మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది.…
మీడియా మిత్రుల చేతుల మీదుగా ఘనంగా ‘కలివి వనం’ టీజర్ లాంఛ్
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్…
