ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ శ్రీ టొమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టు అయింది. అల్లు అర్జున్ మన దేశ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ అందులోని విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ చిత్రపటం బహూకరించడం భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంభాషణకు ప్రతీకగా నిలిచింది. ఇది వారసత్వం, ఆధ్యాత్మికత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఉన్న ఉమ్మడి అభిమానాన్ని చాటింది. ఈ కార్యక్రమం భారతీయ సినిమా, అంతర్జాతీయ సృజనాత్మక వర్గాల మధ్య…
Author: M.D ABDUL
‘అనుమాన పక్షి’ కంటెంట్ ఫన్ ఫుల్ గా ఉంది: గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు
డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, చిలకా ప్రొడక్షన్స్ ‘అనుమాన పక్షి’ నుంచి రమణ గోగుల పాడిన గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్…
‘పెద్ది’ పెహల్వాన్గా.. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుక్రవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ మేకర్స్ బర్త్ డే, శ్రీరామ నవమిని పురస్కరించుకుని అభిమానులకు ఒక పవర్ఫుల్ కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ‘పెద్ది’ పెహల్వాన్ గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో గ్లింప్స్ మొదలౌతుంది. ఆ తర్వాత విజువల్స్ ఆడియన్స్ ని కుస్తీ పోటీలోకి తీసుకువెళ్తాయి. అక్కడ దుమ్ము, చెమట, సంకల్ప బలం ప్రతి ఫ్రేమ్లోనూ కట్టిపడేశాయి. కఠినమైన శిక్షణను తట్టుకుంటూ, ఇటుక…
అబ్బాస్ రీఎంట్రీ..
అప్పట్లో నటుడు అబ్బాస్ ఓ ట్రెండ్ సెటర్. ఆయన హెయిర్ స్టయిల్ కూ ప్రత్యేక అభిమానగణం ఉండేది. విశేష గుర్తింపు పొందిన ఈ నటుడు దాదాపు 11 ఏళ్లు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు ‘హ్యాపీరాజ్’ తో రీఎంట్రీ ఇచ్చారు. ఇంతకాలం ఎక్కడున్నారు? ఏం చేశారు? ‘కాదల్ దేశం’ (ప్రేమదేశం)తో తొలి పరిచయంలోనే అబ్బాస్కు ఊహించనంత క్రేజ్ వచ్చింది. అలా 2007 వరకు వరుస సినిమాలతో బిజీగా మారారు. ఆ తర్వాత చిత్రాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2008 నుంచి 2014 వరకు ఏడాదికి ఒకట్రెండు ఉండేవి. 2015లో కేవలం ఒక్క సినిమా ‘పచక్కళ్లమ్’ (మలయాళం)లో నటించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ ఓ సంస్థలో బిజినెస్ అనలిస్ట్గా పని చేసి.. ఇటీవల భారత్కు తిరిగొచ్చారు. ఆ తర్వాత కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘19…
‘షైన్ స్క్రీన్స్’ భారీ సినిమాటిక్ కొలాబరేషన్!
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్ లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ఇటీవల ఒక భారీ సినిమాటిక్ కొలాబరేషన్ ను ప్రకటించింది. భారీ పండుగ వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ రీజినల్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస విజయాలను అందించింది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది. ఎఫ్-2, ఎఫ్-3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్బస్టర్ ఎంటర్టైనర్ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే…
స్వచ్ఛంద సంస్థలకు మెగాస్టార్ విరాళం
స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా గద్దర్ అవార్డ్స్ నగదు బహుమతి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బ్లాక్బస్టర్ విజయాన్ని ఆస్వాదిస్తూ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి, తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డుతో పాటు పది లక్షల నగదు బహుమతి అందుకున్న చిరంజీవి, ఆ మొత్తాన్ని తన చిరకాల సామాజిక సంక్షేమ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వారి దైనందిన అవసరాలకు మద్దతుగా చిరంజీవి ‘సర్వ్ ఫౌండేషన్’కు విరాళం అందించారు. “గేమ్ ఛేంజర్” షూటింగ్ సమయంలో రామ్ చరణ్ను కలిసిన వృద్ధులు ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆశపడగా, చిరంజీవి ఆ కోరికను నెరవేర్చారు. 30 మంది వృద్ధులను బ్లడ్…
ఏప్రిల్ 17న నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’
హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్బస్టర్గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో పిడికిలి బిగించి నాగ…
‘స్పైడర్ మ్యాన్’ ట్రైలర్…రికార్డుల మోత!
గ్లోబల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి ప్రూవ్ అయింది. తాజాగా విడుదలైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 1 బిలియన్ వ్యూస్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ గా కనిపించనున్నాడు. అతనితో జోడీగా జెండయా నటిస్తుండగా, జాకబ్ బాటలన్, సాడీ సింక్, జాన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మిస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ…
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డ్స్ లో ‘మన్యం ధీరుడు’కి ఉత్తమ చిత్ర అవార్డు
మలేషియన్ ఉగాది పురస్కార్ అవార్డు 2026 గాను ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు కు ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. మలేషియా తెలుగు సంఘం క్లాంగ్ శాఖ ఆధ్వర్యంలో సుందర్ పెరుమాళ్ ఆలయం ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగిన ఉగాది వేడుకలలో ఉగాది పురస్కార్ 2026 ఉత్తమ చిత్ర అవార్డును మన్యం ధీరుడు చిత్రానికి ఇవ్వడం జరిగింది. మలేషియా తెలుగు సంఘం చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్ ఉత్తర జిల్లా పోలీస్ కమిషనర్ విజయరావు చేతుల మీదుగా ఆర్ వి వి సత్యనారాయణ మరియు శ్రీమతి ఆర్ పార్వతి దేవి దంపతులను ఘనంగా సత్కరించి పురస్కార ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు సుబ్రమణ్యం రామానాయుడు కమిటీ మెంబర్స్ 600…
కార్మేని సెల్వం’ సినిమా చూసి ఈఎమ్ఐలను తగ్గించుకోవాలనుకుంటారు : ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సముద్రఖని
మధ్యతరగతి కుటుంబ కథే ‘కార్మేని సెల్వం’ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు కనెక్ట్ అయ్యే చిత్రం ‘కార్మేని సెల్వం’ పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. గురువారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుత…
