ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన మంచు మనోజ్

hero Manchu Manoj Meets Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy
Spread the love

టాలీవుడ్ యువహీరో మంచు మనోజ్ ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిని అమరావతిలో కలిశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అభివృద్ది అంశాలపై చర్చించామని హీరో మంచు మనోజ్ తెలిపారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తూ ఆశాజనకమైన ప్రణాళికలతో ముందు కెళుతున్నారు. అందుకే ఆయనకు బాసటగా నిలిచానని మనోజ్ చెప్పారు. తాజాగా ట్విట్టర్ లో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి దిగిన ఫోటోని మనోజ్ పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా దూరదృష్టి కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలిసి రాష్ట్రం కోసం కొన్ని గొప్ప ఉత్పాదక (అభివృద్ధి) ఆలోచనలను మార్పిడి చేసుకోవడం ఒక గౌరవం..మ‌రియు విశేషం. సమీప భవిష్యత్తు కోసం సీఎం గారి ప్రణాళికలను విన్నాను. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. జగన్ సార్ .. మీ విజన్ సాధించడానికి దేవుడు మీకు సమృద్ధిగా బలం మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మీ పాలనకు శుభాకాంక్షలు అని ట్వ‌ట్ట‌ర్ ద్వారా తెలిపారు మంచు మ‌నోజ్‌.

Related posts

Leave a Comment