నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు తెలంగాణ నటుడు తిరువీర్ ఈ యువకుడు ’జార్జ్ రెడ్డి’, ’పలాస’, ’మల్లేశం’ తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇటీవలే మసూద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ’పరేషాన్’. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా దగ్గుబాటి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్గా ఆలరించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీలివ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఈ సినిమా స్టీమ్రింగ్ కానుండగా.. చెప్పిన డేట్ కంటే ముందే నిన్నరాత్రి సోనీలివ్ ఈ సినిమాను విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇబ్బందులు ’పరేషాన్’ అనే పేరు పెట్టుకుని వచ్చేసాయి. ప్లలెటూరి జీవితంలోని హ్యాపీనెస్ను ఎంజాయ్ చేయండి. రానా దగుబట్టి సమర్పిస్తున్న ’పరేషాన్’ ఇప్పుడు సోనీ లీవ్లో ప్రసారం అవుతుందంటూ సోషల్ విూడియాలో రాసుకొచ్చింది. దీనితోపాటు ఓ వీడియోను జత చేసింది.
ఓటిటిలోకి వచ్చిన ‘పరేషాన్’!
