భారత ప్రభుత్వం నుండి తనకు పద్మశ్రీ పురస్కారం అందిన సందర్భంగా ప్రఖ్యాత సినీ నటులు మాగంటి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాని శనివారం లోక్ భవన్ లో కలిసారు. ఈ సందర్బంగా మురళీమోహన్ ని గవర్నర్ అభినందించి సత్కరించారు. చిత్రంలో కుటుంబ సభ్యులు రూపా మాగంటి, బి.యస్.రావు కూడా ఉన్నారు.
Day: July 11, 2026
‘ఓ..! సుకుమారి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
దామిని గురించి ఊరంతా భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే… ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సమస్యను భార్యాభర్తలు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వారి జీవితంలో ప్రేమ, ఆనందం ఎలా చోటుచేసుకున్నాయి? అన్నదే ‘ఓ..! సుకుమారి’ సినిమా ప్రధాన కథాంశం. టీజర్, ఫస్ట్ సింగిల్తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, ‘శివం భాజే’ విజయం తర్వాత గంగా…
