వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’ . ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి.. కృష్ణమ్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మూవీని థియేటర్స్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్గా విడుదలైన ‘కృష్ణమ్మ’ సినిమా టీజర్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సత్యదేవ్ లుక్కి, అతని యాక్టింగ్లోని ఇన్టెన్సిటీతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ఇటీవల విడుదలైన మెలోడీ సాంగ్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది. కృష్ణమ్మ సినిమా కథలోని మెయిన్ సోల్ను…
Year: 2022
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ ‘లైక్ షేర్ & సబ్స్క్రైబ్’ ఫస్ట్ లుక్ విడుదల
వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని సూపర్హిట్లను సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్తో ఒక సినిమా చేస్తున్నారు. సంతోష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్’ ఏక్ మినీ కథ’ కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించినందున వారి క్రేజీ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. యూనిక్ కాన్సెప్ట్తో రూపొందుతున్న లవ్ అండ్ ఎంటర్టైనర్లో సంతోష్ శోభన్ జోడిగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆముక్త…
‘శాకిని డాకిని’ అందరినీ అలరిస్తారు : ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’ విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది. రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. ‘శాకిని డాకిని’ కొరియన్ ఫిల్మ్ రీమేక్. తెలుగు నేటివిటీ తగ్గట్టు అద్భుతంగా మలిచాం. ఈ సినిమా నా కెరియర్ లో ఒక మైలు రాయి. ‘శాకిని డాకిని’ లో యాక్షన్ కామెడీ…
దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ షూటింగ్ పూర్తి
స్టార్స్తో పాటు నూతన నటీనటులతో బ్లాక్బస్టర్లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం. ఆయన తన చిత్రాలతో చాలా మంది నటులను పరిచయం చేశారు. వారిలో కొందరు స్టార్లుగా మారారు. కంటెంట్యే కింగ్ అని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తాయని చాలాసార్లు నిరూపించారు తేజ. ఇప్పుడు తేజ ‘అహింస’ అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్తో మరో కొత్త నటుడు అభిరామ్ని హీరోగా పరిచయం చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన కథతో తేజ మార్క్ సినిమా ఇది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతిక తివారీ కథానాయికగా కనిపిస్తున్న ఈ చిత్రంలో సదా, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ప్రీ లుక్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ‘అహింస లో హై యాక్షన్…
Liger Is Strong Even With Negative Talk
Vijay Deverakonda’s Liger released in theaters on the 25th of August. The actioner is directed by Puri Jagannadh and it got a wide pan-India release. Liger opened to negative reviews, but that isn’t stopping the film from registering good theatrical returns. The film has collected Rs 70 crores gross worldwide and it has collected a share of Rs 31 crores. It made another Rs 20 crores in Hindi. Vijay’s crowd pulling capabilities are far outweighing the negative talk for the film and they are giving the impression that the film…
నెగిటివ్ టాక్ లోనూ విజయ్ దేవరకొండ ‘లైగర్’ సూపర్బ్ కలెక్షన్స్!!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం లైగర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబడుతున్నది. హీరోగా విజయ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్ స్టామినా కలిసి లైగర్ ను బాక్సాఫీస్ వద్ద తలెత్తుకునేలా చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ 70 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. 31 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. బాలీవుడ్ లో దాదాపు 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ తెచ్చుకుంది. ప్రతికూల ఫలితంలోనూ ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకోవడం అది విజయ్ క్రేజ్, స్టార్ డమ్ వల్లే సాధ్యమైంది. ఈ నెంబర్స్ చూస్తుంటే ..ఒకవేళ సినిమాకు…
ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ‘కెప్టెన్’ : హీరో ఆర్య ఇంటర్వ్యూ
ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… ప్రశ్న: ‘కెప్టెన్’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? విన్న తర్వాత మీ స్పందన ఏంటి? ఆర్య : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా.…
ఐజేయూ సారథిగా శ్రీనివాస్ రెడ్డి
ఐజేయూ సారథులుగా తిరిగి ఎన్నికైన కె. శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడుగా కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ గా బల్విందర్ సింగ్ జమ్మూ తిరిగి ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులతోపాటు, 150 మంది ఐజేయూ కౌన్సిల్ సభ్యుల పదవులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికి కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ పదవికి బల్విందర్ సింగ్ జమ్మూ తరపున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వారిద్దరూ పోటీ లేకుండా ఎన్నికైనట్టు ఐజేయూ ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ (సీఆర్డీ) ఎం.ఎ. మాజిద్ ప్రకటించారు. వారిద్దరి తరపున 12 రాష్ట్రాల నుంచి రెండేసి సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. అది…
Allu Arjun and his staff bid adieu to Lord Ganesh
Every year, Allu Arjun welcomes Lord Ganesh to his office and celebrates the festival of Ganesh Chaturthi with his staff in a grand manner. This year was no different. A recent video that went viral shows Allu Arjun participating in Ganesh Visarjan with his team. An actor with no airs and rooted to his culture, Allu Arjun did not hesitate to get on to the road to celebrate. He broke a coconut as he bid adieu to the Lord with his daughter by his side. In fact, he even encouraged…
సంస్కృతిని మర్చిపోని పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
ప్రతి సంవత్సరం, అల్లు అర్జున్ తన కార్యాలయంలో వినాయకుని ప్రతిష్టించి పూజలు జరుపుతారు. గణేష్ చతుర్థి పండుగను తన సిబ్బందితో ఘనంగా జరుపుకుంటాడు. ఈ సంవత్సరం కూడా ఆ మాదిరిగానే గణేశుని ప్రతిమను ప్రతిష్టించారు. అల్లు అర్జున్ తన బృందంతో కలిసి గణేష్ నిమజ్జనంలో పాల్గొంటున్నట్లు ఇటీవలి వీడియో వైరల్ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని మరిచిపోలేదు. నిమజ్జన వేడుకలు నిమిత్తం రోడ్డుపైకి రావడానికి వెనుకాడలేదు. తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలుకుతూ కొబ్బరికాయ పగలగొట్టాడు అల్లు అర్జున్. అలానే అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని మరియు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ప్రోత్సహించాడు.
