గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన “వర్షం” సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులంతా అత్యుత్తమ నటనను కనబరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా వీనులవిందుగా ఆకట్టుకున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. ఆ రోజులలో ప్రభాస్ కెరీర్ మలుపులో ఈ సినిమా అగ్ర భాగాన నిలిచింది కూడా. “ఈశ్వర్” సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “వర్షం” సినిమాను తమ…
Year: 2022
సమంతతో పాన్ ఇండియా సినిమా ఎక్స్పరిమెంట్ అనుకోలేదు, ఎగ్జైట్ అయ్యాను : నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇంటర్వ్యూ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం… సమంత నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘యశోద’…
‘బొమ్మ బ్లాక్ బ్లస్టర్’ ను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : ‘బొమ్మ బ్లాక్’ బస్టర్ టీమ్
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నందు విజయ్కృష్ణ హీరోగా.. యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్బస్టర్’. ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ.. నందు,విరాట్, రష్మీ లు ఎంచుకొన్న కథకు. సీనియర్ ఆర్టిస్టులను కాకుండా కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యంతో తీసిన మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ…
‘చిక్లెట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేసిన యం. ముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా చిక్లెట్స్. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ సినిమాలో బాలనటుడిగా సుపరిచితుడైన సాత్విక్ వర్మ, జాక్ రాబిన్ సన్, రీజీమ్ హీరోలుగా నటిస్తుండగా.. నయన్ కరిష్మా, అమిర్తా హల్దార్, మంజీరాలు హీరోయిన్స్గా నటిస్తున్నారు.ఎస్.ఎస్.బి ఫిల్మ్ బ్యానర్లో ఏ శ్రీనివాసన్ గురు ఈ సినిమాను రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. పూర్తి యూత్ కంటెంట్తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. బాలమురళి బాలు సంగీతాన్ని అందిస్తున్నారు. అజిత్ వలిమై సినిమాకు ఎడిటర్గా పనిచేసిన విజయ్ వేలుకుట్టి ఈ సినిమాను ఎడిట్ చేస్తున్నారు. కొలంచి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల…
కమిట్ మెంట్ లేని హీరోతో సినిమా చేయడంలేదు: విశ్వక్సేన్ ప్రవర్తనపై విరుచుకుపడ్డ యాక్షన్ కింగ్ అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్యను తెలుగుతెరకు పరిచయం చేస్తూ విశ్వక్సేన్ హీరోగా ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో విశ్వక్సేన్ తనను, తన యూనిట్ ని అనేక ఇబ్బందులకు గురిచేశాడని, షూటింగ్ కు అంతరాయం కలిగించాడని అర్జున్ శనివారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో విశ్వక్సేన్ పై తీవ్రంగానే విరుచుకు పడ్డారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ .. ” కొన్నివెబ్ సైట్స్ లో మా సినిమా నుంచి వీశ్వక్ సేన్ బయటకు వచ్చాడు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎందుకు వచ్చాయో నాకు ఏమాత్రం తెలీదు. నా కూతురు ఐశ్వర్యను తెలుగు చిత్ర సీమ ద్వారా హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాను. నా స్టొరీ విశ్వక్ సేన్ కి…
మధ్యప్రదేశ్ ప్రభుత్వం చిత్రపరిశ్రమకు అందిస్తున్న మహత్తర అవకాశం!!
50 శాతం షూటింగ్ చేసే చిత్రాలకు గరిష్టంగా 2 కోట్ల రాయితీ!! మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని (టూరిజం) ప్రోత్సహించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ (MPTB) తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తోంది. అక్కడ ప్రభుత్వ లొకేషన్లకు చెల్లించే సొమ్ములో 75 శాతం సైతం వెనక్కి ఇస్తోంది. అంతేకాదు… ఆ రాష్ట్రం నలుమూలలా ఇబ్బందులు లేకుండా షూటింగ్ చేసుకునేందుకు అనుమతులు చాలా సులభంగా లభించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ విషయాలు వెల్లడించేందుకు మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ “ఉమాకాంత్ చౌదరి” తన సిబ్బందితో సహా హైదరాబాద్ విచ్చేశారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా… ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రతి…
‘యశోద’ కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్ : ఉన్ని ముకుందన్ ఇంటర్వ్యూ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ మీడియాతో ముచ్చటించారు. – హాయ్ ఉన్ని ముకుందన్ గారు… ఎలా ఉన్నారు? ఉన్ని ముకుందన్ : హలో అండి. నేను బావున్నాను. సూపర్బ్. ‘యశోద’ విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను. – తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న ‘యశోద’ విడుదలవుతోంది. ఇంతకు ముందు మీరు తెలుగు సినిమాలు చేశారు. వెల్కమ్ బ్యాక్…
శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్ని : దర్శకుడు సుకుమార్
ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి ..అజయ్ఘోష్, బిత్తిరి సత్తి ప్రణవి సాధనాల టార్జాన్ జెమిని సురేష్ ముఖ్యపాత్రల్లో.కోట శ్రీనివాసరావు తనికెళ్ళ భరణి బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం ‘‘దోచేవారెవురా’’. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలోని ‘‘సుక్కు,సుక్కు ….’’ సాంగ్ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. సిరాశ్రీ సాహిత్యం అందించారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ ఒకసారి దర్శకుడు అయిన తర్వాత ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూండాలి అనుకుంటారు. అందుకే శివనగేశ్వరరావుగారు వన్స్మోర్ అని ఒక యూట్యూబ్ చానల్ పెట్టారు. అందులో ఆయన అనుభవాలను ఒక్క అబద్దం కూడా లేకుండా చాలా సిన్సియర్గా మాట్లాడతారు. అజయ్ఘోష్ చాలా మంచి ఆర్టిస్ట్. సినిమా పరిశ్రమకు ఆయన లేటుగా పరిచయమయ్యారేమో అనిపిస్తుంది నాకు. నేను విడుదల చేసిన రెండోపాటలో సుక్కు, సుక్కు అనే సౌండ్ నాకు బాగా…
నవంబర్ 18న విడుదలకు సిద్దమవుతున్న ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’
శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే విభిన్నమైన ప్రేమకథాచిత్రమిది. ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి మా చిత్రానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. దర్శకుడు వినయ్బాబు అత్భుతమైన ట్విస్ట్లతో సినిమాను ఇంట్రెస్టింగ్గా తెరక్కించారు. కచ్చితంగా ఇదొక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది. అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. యువతో పాటు ప్రతి…
డిసెంబర్ 2న రానున్న ‘హిట్ 2’ చూడటానికి చాలా ఎగ్జయిటింగ్గా వెయిట్ చేస్తున్నా: అడివి శేష్
క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ హీరో అడివి శేష్. ఆయన కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘హిట్ 2’. ‘ది సెకండ్ కేస్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన ‘హిట్’ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. గురువారం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా… ఎడిటర్ గ్యారీ బి.హెచ్ మాట్లాడుతూ ‘‘అడివి శేష్తో ఇది నాలుగో చిత్రం. అలాగే డైరెక్టర్ శైలేష్తో ఇది మూడవ చిత్రం. టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. ట్రైలర్ దీనికి మించి బావుంటుంది. సినిమా ఇంకా బావుంటుంది.…
