పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
వైభవంగా వేదశ్రీ-సోమశేఖర్ కళ్యాణోత్సవం
Spread the love హైదరాబాద్, ఏప్రిల్ 18 : హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కోడెం సుధ -కోడెం రమేష్ ల ఏకైక... -
‘డియర్ ఉమ’ చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి.. నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయ రెడ్డి
Spread the love తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది.... -
Dear Uma Is An Awareness Driven Film Like Venkatesh’s Ganesh: Team At Sumaya Reddy’s Dear Uma Pre-Release Event
Spread the love Telugu actress Sumaya Reddy is making her debut as a heroine, producer, and...