పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే హోప్స్
Spread the love హీరోయిన్ శ్రీలీలది ఒకప్పుడు గోల్డెన్ హ్యాండ్. ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ భామ కెరీర్ ప్రస్తుతం... -
మెగాస్టార్ ఇంట్లో ఘనంగా విజయోత్సవ వేడుక
Spread the love * హాజరైన వెంకటేష్, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి మెగా ఎంటర్టైనర్... -
అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్
Spread the love సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరో గుడ్న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా బ్లాక్...
