పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
‘వారాణసి’ కోసం..పాన్ వరల్డ్ లెవెల్లో హైప్!
Spread the love * గ్లోబల్ ప్రాజెక్ట్ చిత్రం కోసం ప్రియాంక చోప్రా ప్రమోట్ పాన్ వరల్డ్ లెవెల్లో మంచి హైప్... -
భూమి పెడ్నేకర్ : పవర్ఫుల్ పాత్రలవైపే మొగ్గు!
Spread the love బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో, భూమి పెడ్నేకర్ మాత్రం తనకంటూ... -
పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి..సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Spread the love హీరో విజయ్-త్రిష చెన్నైలో జరిగిన ఓ పెళ్లిలో సందడి చేశారు. విజయ్ భార్య సంగీత ఇటీవల సంచలన ఆరోపణలు...
