సినీ నటుడు రెబల్స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణం రాజు జన్మించిన జర్నలిస్టుగా పని చేశారు. 1966లో ‘చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. హీరోగా, విలన్గా అనేక పాత్రల్లో నటించారు. 1977,1984లో నంది అవార్డులు గెలుచుకున్నారు. 2006లో ఫిల్మ్ఫేర్ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారం పొందారు. రాజకీయాల్లోకి వచ్చి వాజ్పేయి హయాంలో కేంద్రమంత్రిగానూ సేవలందించారు. రెబల్స్టార్ కృష్ణం రాజు మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ఆయన చిరకాల కోరికలను సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. గవర్నర్ పదవి, ప్రభాస్ పెళ్లి చూడాలనే కోరికలు తీరకుండానే కన్నుమూశారు. తమిళనాడు, కేరళ గవర్నర్ అవుతారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. మోదీ అధికారంలోకి వచ్చాక మొదటి గవర్నమెంట్లోనే పదవి వస్తుందని ఆయన ఆశించారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్త విన్న చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయింది.
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు
