ఫిబ్రవరి 11న రానున్న అడివి శేష్ ‘మేజర్’

Adivi Sesh’s Major Releasing On February 11
Adivi Sesh’s Major Releasing On February 11
Spread the love

అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీపావళికి ముందు రోజు ఇలా అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు మేక‌ర్స్‌. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మూడు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా.. ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. ఈ వీడియోలో అతని జర్ని, ప్రేమ అన్నీ చూపించారు. టీనేజ్ కుర్రాడి నుంచి ధైర్యసాహసాలు కలిగిన సైనికుడిగా మారిన జర్నీని చూపించారు. ఇప్పటి వరకు ఈ చిత్రంను విడుదల చేసిన ప్రతీ అప్డేట్ అంచనాలను మరింత పెంచింది. ఇప్పుడు ఈ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఆయన ఏ స్ఫూర్తితో జీవించారు.. ఎలా మరణించారు అనేవి అందరినీ కట్టిపడేసేలా చూపించనున్నారు.
ఇది వరకు విడుదల చేసిన టీజర్‌లో మేజర్ ఉన్ని కృష్ణన్ బాల్యాన్ని చూపించారు. టీనేజ్ నుంచి ఆర్మీ ఆఫీసర్‌గా ఎదిగిన క్రమాన్ని చూపించారు. వార్ డ్రామాతో రాబోతోన్న ఈ సినిమా మీద టీజర్ అంచనాలు పెంచేసింది.
శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అడివి శేష్, శోబితా ధూళిపాళ్ల, సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. హిందీ, తెలుగు, మళయాల భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.