ప్రభాస్ ‘రాధేశ్యామ్’ వాయిదా!

radheshyam

డార్లింగ్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశపరుస్తూ ‘రాధేశ్యామ్’ వాయిదా పడింది. కరోనా.. ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మొత్తంమీద ‘రాధేశ్యామ్’ మూవీ టీమ్ ప్రకటన అభిమానులు గత కొన్నిరోజులుగా అనుకుంటున్నదే జరిగింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ప్రకటించింది.1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్, పాలమిస్ట్ (హస్తరేఖా సాముద్రిక నిపుణుడు)గా నటించారు. పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్…

అనసూయ భరద్వాజ్ ఆనందానికి హద్దులు లేవు!!

ATTACHMENT DETAILS Saved. anasuya_bharadwajs_first_look_as_alice_from_malayalam_movie_bheeshma_parvam_is_out_main

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి గా అదరగొట్డిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ హాట్ హాట్ బ్యూటీకి మలయాళం సినిమా నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే ఛాన్సే! మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన జంటగా నటించడమంటే మాటలుకాదు.. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో సాగే ఆ సినిమా పేరు ‘భీష్మ పర్వం’. షూటింగ్ తదితర కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకున్న అనసూయ అంతకు ముందు సుకుమార్ `రంగస్థలంలో రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌పై బిగ్‌ బ్రేక్‌ని…

అనసూయ హంగామా అంతా ఇంతా కాదు!!

Anasuya-Bharadwaj

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ అందంపై సోషల మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆమె దిగే ఫొటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్‌ ట్రోల్‌కి గురవుతుంటుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లోపాలను ఎత్తేందుకు లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. అనసూయ `జబర్దస్త్` షోతో యాంకర్‌ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై తాజాగా మరోసారి సోషల మీడియాలో చర్చ మొదలైంది. మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్‌ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే…

‘ఆచార్య ’లో తనదైన మార్క్ స్టెప్పులతో దుమ్ములేపిన మెగాస్టార్

megastar Acharya song

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు.…

ధనుష్ మొదటి తెలుగు సినిమా ఎందుకు మారింది ?

hero dhanush movie news

తమిళ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి . మదరాసు నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన సందర్భంలో కథా నేపథ్యం నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి . ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ధనుష్ మొదటి తెలుగు సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా తాజాగా మొదలయింది . సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. మరి ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా మొదట ఎందుకు ప్రారంభం కాలేదని చాలా మందిలో సందేహం వచ్చింది. శేఖర్ కమ్ముల కథ రెడీ చేయలేదేమోనని చాలా మంది భావించారు. కాని వాస్తవానికి హీరో ధనుష్ కి – ఆ చిత్ర నిర్మాతలకు మధ్య పారితోషికం విషయంగా ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ముందు వెంకీ…

సమంత ‘శాకుంతలం’ ఎప్పుడు?

Samantha Shakuntalam

సీనియర్ డైరెక్టర్ గుణ శేఖర్ ‘రుద్రమ దేవి’ సినిమా తర్వాత – ఏడేళ్ళ గ్యాప్ తీసుకొని సొంతంగా నిర్మించి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘శాకుంతలం ‘. సమంత శకుంతలగా నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో దుష్యంతుడి పాత్రను మళయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు . లోగడ తెలుగులో ‘శకుంతల‘ సినిమాలో ఎన్.టి.ఆర్, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ లో బాలకృష్ణ పోషించారు. తెలుగులో నటిస్తున్న మొదటి సినిమాలోనే దేవ్ మోహన్ కి దుష్యంతుడి పాత్ర దొరకడం అదృష్టమనే చెప్పాలి . అలాగే ‘ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్ తో, ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ తో జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సమంతకి ఈ పాన్ ఇండియా మరింత ప్లస్ అనే చెప్పాలి . కబీర్ బేడీ , మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.…

సంతోష్ శోభన్ సరసన ఫరియా అబ్దుల్లా !

Fariya abdullha heroine news

ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ‘జాతి ర‌త్నాలు’లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ ‘జాతిరత్నాలు’ సినిమాతో మరింత దగ్గరైంది. ఒకే ఒక్క సినిమా ‘జాతి రత్నాలు‘తో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘బంగార్రాజు‘ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే ! ఇప్పుడు సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా చేయబోతుంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ లో మొదలవుతుంది. ఇంతకు ముందు మేర్లపాక గాంధీ రాసిన ‘ఏక్ మినీ స్టోరీ’ సినిమాలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ కి గాంధీ డైరెక్షన్ లో చేయడం ఇదే మొదటిసారి! ‘శ్యామ్…

త్రివిక్రమ్ క్లాప్ తో ధనుష్ – వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం‌ ‘సార్‌’ ప్రారంభం

Dhanush's Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) నేడు 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నాయకా,నాయికలు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ…

Dhanush’s Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

Dhanush's Telugu-Tamil bilingual SIR/Vaathi, directed by Venky Atluri, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, formally launched

Leading production house Sithara Entertainments and Fortune Four Cinemas are joining hands to produce 2 time-National Award Winning actor Dhanush’s Telugu-Tamil bilingual titled ‘SIR’ (Telugu)’/’Vaathi’ (Tamil). The film, written and directed by Venky Atluri, starring Samyuktha Menon in the lead, was announced recently. The project went on floors formally with a pooja ceremony in Ramanaidu Studio, Hyderabad today at 10.19 am in the presence of the cast, crew and distinguished guests including director Trivikram, producers S.Radhakrishna (Chinababu), KL Narayana, ML Kumar Chowdary, S.Radhakrishna (Chinababu) besides Suresh Chukkapalli, Narra Srinivas and…

దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత

Director P C REDDY No More

ప్రఖ్యాత సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 లకు చెన్నై లో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నాటి ప్రముఖ హీరోలు అందరి చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు.. ఎక్కువగా దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. గ్రామీణ కథాంశాల మీద ఎక్కువ పట్టు ఉన్న దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి. పి.సి.రెడ్డిగా ఎక్కువ పాప్యులర్. రీమేక్ చిత్రాల దర్శకుడుగా ఎక్కువ హిట్స్ ఇచ్చిన వి.మధుసూదనరావు వద్ద శిష్యరికం చేసిన ఈయన రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి గ్రామ మున్సబుగా చేసేవారు. మద్రాసులో బి.ఏ.చదివిన తరువాత చిత్ర రంగంలో సహాయ…