టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత చెర్రీ మీటర్ విశేషాలనిమీడియాతో పంచుకున్నారు. బాక్సాఫీసు కి ఏ రేంజ్ మీటర్ సెట్ చేశారు ? – టీజర్, ట్రైలర్…
Year: 2023
తెలుగు చిత్రపరిశ్రమలో ‘బలగం’ ఓ చరిత్ర.. మా బాధ్యతను మరింత పెంచింది : నిర్మాత దిల్ రాజు
దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆదరణ పొందుతూ దూసుకెళ్తోంది. పల్లెటూళ్లలో అయితే తెరలు ఏర్పాటు చేసుకుని ఊరు ఊరంతా కలిసి సినిమాను చూస్తున్నారు.. ఎమోషనల్ అవుతున్నారు. అలాగే బలగం సినిమాకు 7 ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్ రాజు, దర్శకుడు వేణు, నిర్మాతలు హర్షిత్, హన్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో..…
‘విరూపాక్ష’ సినిమాకు కథే హీరో.. పాత్రల పరిచయ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్లో ఈ…
విడుదలైన అన్ని థియేటర్స్ లో విజయంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రం ‘పరారీ’ : సక్సెస్ మీట్ లో సీనియర్ నటులు సుమన్
గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “పరారీ”..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది..ఈ సందర్బంగా.. సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ..ఎంతో కష్టపడి తీసిన నిర్మాత గిరి గారికి “పరారి” సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంటారు. అయితే యోగేష్ నటించిన…
‘రావణాసుర’ మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా…
చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదములు : హీరో రాజ్ కార్తికేన్
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా…
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ `పోప్స్ ఎక్సార్సిస్ట్` ఏప్రిల్ 7న రాబోతుంది!!
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ది పోప్స్ ఎక్సార్సిస్ట్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి జూలియస్ అవేరీ దర్శకత్వం వహించారు. అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం ఇది. పోప్ యొక్క భూతవైద్యుడు ఫాదర్ గాబ్రియెల్ అమోర్త్గా రస్సెల్ క్రోవ్ నటించారు. ఈ చిత్రంలో డేనియల్ జొవట్టో, అలెక్స్ ఎస్సో మరియు ఫ్రాంకో నీరో కూడా నటించారు. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. కథగా చెప్పాలంటే, తండ్రి గాబ్రియేల్ ఒక యువకుడిని భయంకరమైన పరిశోధనను ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు వాటికన్ శతాబ్దాల నాటి కుట్రను వెలికితీస్తాడు. ఆ క్రమంలో ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటర్, దెయ్యం పట్టిన ఒకరిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అస్థిరమైన దెయ్యాల నివాసం, శతాబ్దాల నాటి రహస్యం వెనుక చాలా పెద్ద కుట్ర వెలుగులోకి…
తమిళ్ లో అదరగొడుతోన్న శింబు ‘పాతు తల’
క్రేజీ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా ‘పాతు తల’. ఒబెలి ఎన్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రీసెంట్ గా మార్చ్ ౩౦న రిలీజ్ అయినా ఈ చిత్రం శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 2017లో కన్నడలో సూపర్ హిట్ అయినా మఫ్టీ చిత్రానికి రీమేక్ గ వచ్చిందీ చిత్రం. శింబు గెట్ అప్ తో పాటు నటనకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఏ జి రావణన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు శింబు. మామూలుగా శింబు సినిమాలంటే తమిళనాట ఫ్యాన్ షోస్ ఉంటాయి. బట్ ఈ చిత్రానికి ఫ్యాన్ షోస్ లేకపోయినా.. వర్కింగ్ డే అయినా.. రెగ్యులర్ రేట్స్ తోనే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ మూవీ. మొదటి రోజు 12.03 కోట్ల వసూళ్లు సాధించి…
Costume Krishna Passed Away : నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ ఇకలేరు!
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. గొప్ప నిర్మాత, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా చక్కటి గుర్తింపును తెచ్చుకున్న ఆయన అనారోగ్యంతో నేడు (ఏప్రిల్ 2, ఆదివారం) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 1954లో చెన్నై వెళ్లి అసిస్టెంట్ కాస్ట్యూమర్గా సినిమారంగంలో ప్రవేశించిన ఆయన అతి తక్కువ కాలంలోనే కాస్ట్యూమ్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు. జగపతి బాబు హీరోగా వచ్చిన ‘పెళ్ళిపందిరి’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని ‘అరుంధతి’…
‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ కు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సత్కారం!
“నాటు నాటు” పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ లయన్ డా.ప్రతానిరామకృష్ణగౌడ్ . ఈ సందర్భంగా దుబాయ్లో జరగనున్న టిఎఫ్సిసి నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదికపై అక్కడి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్సిసి నంది అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “చంద్రబోస్గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి దర్శకత్వం వహించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న మరియు అనేక చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు.. తన సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్గారికి నా…
