5 కోట్లు డిమాండ్ చేస్తూ పోలీసులకు మెసేజ్ అప్రమత్తం అయిన పోలీసులు..మెసేజ్పై ఆరా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్కు ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ మెసేజ్ వచ్చింది. ‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇటీవల హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని దుండగులు అందులో బెదిరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్…