పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన్వి నేగి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెం 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అందరినీ అలరించి యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. యూత్ ఫుల్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో దర్శకుడు వి యశస్వీ మాట్లాడుతూ..…