నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న దుబాయ్లో జరిగే నంది అవార్డ్ వేడుకకు ఫిల్మ్ ఛాంబర్కు ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్లో జరిగే నంది అవార్డుల వేడుక ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతమని పేర్కొంది. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీస్టేట్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఈ ఈవెంట్కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ, మరియు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్…