విడుదలకు సిద్ధమైన ‘ఏమైపోయావే’

emai poyave movie

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పొస్టర్ కు మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ… ”మా బ్యానర్లో ‘ఏమైపోయావే’ చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన మా చిత్ర సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం, అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుంది అన్నారు. రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి,…