ప్రేమకు పేద, ధనిక అనే బేదం ఉండదు. మనసుకు నచ్చిన వారు కనపడితే చాలు వెంటనే ప్రేమ పుడుతుంది. మనసులో ప్రేమ పుట్టటం కాదు.. ఆ ప్రేమను నిచ్చెలికి అందంగా చెప్పటమూ ఓ కళ. మీనాక్షిని చూడగానే ఆ యువకుడికి హృదయం లయ తప్పింది. ఇంకేముంది. ‘‘మీనాచ్చి మీనాచ్చి నిన్నే చూడగా.. ఓ.. ఓ/మనసిచ్చి మనసిచ్చి నచ్చా నిన్నుగా.. ఓ ..ఓ/ కలగా వచ్చేశావు కళ్లకెదురుగా../ అలవై లాగావు నన్ను పూర్తిగా.. .. ’’అంటూ అందంగా పాట రూపంలో మీనాక్షిని తన ప్రేమను చెప్పేశాడా యువకుడు. ఇంతకీ కథానాయకుడు ఎవరు? అతని హృదయాన్ని దోచుకున్న మీనాక్షి ఎవరు? అనే విషయం తెలుసుకోవాలంటే ఆనంద్ రవి హీరోగా నటిస్తోన్న ‘కొరమీను’ సినిమా చూడాల్సిందే. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి…