‘#కృష్ణారామా ‘చాలా ప్రత్యేకమైన చిత్రం : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌

'#Krishnarama' Very Special Movie: Actor Rajendra Prasad at Teaser Launch Event

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ కి అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. ఈ…