ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు. లేదా… ఈ సినిమాకి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు. అదేమీ కాదు… ఈ సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి- ది ఎపిక్2025’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దర్శకుడు పూర్తి చేశారు. దాని రన్ టైమ్ కూడా ఎంతనో చెప్పేశారు. ఇప్పుడు అసలు విషయం…
