రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా “మిస్టీరియస్”. రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత జయ్ వల్లందాస్ తెలిపారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ … – మా “మిస్టీరియస్” సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. నేను యూఎస్ లో ఉంటాను. సినిమా రంగం మీద ఆసక్తితో టాలీవుడ్ కు వచ్చాను. నా స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిని చేయాలనే సంకల్పంతో “మిస్టీరియస్” చిత్రాన్ని నిర్మించాను. ఈ…
