హైదరాబాద్, మార్చి 25 : భాగ్యనగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. . హ్యాపీ హోలీ అంటూ యువత సోమవారం తెల్లవారుజాము నుంచే పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. కలర్ఫుల్ పండుగ వేడుకల్లో హైదరాబాద్ సరికొత్త అందాలను సంతరించుకుంది. ముఖ్యంగా ఈ హోలీ వేడుకలు సోమవారం శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శ్రీ సాయినగర్ సౌత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు బద్దం భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చెరుకు ఉమేష్ గౌడ్, పి.ఎస్.రాము, సర్దా శివకృష్ణ, ఏలే సుధాకర్, రేవంత్ గౌడ్, కృష్ణారెడ్డి, భాస్కర్, రాము గౌడ్, వీరాచారి తదితరులు ఈ హోలీ వేడుకల్లో పాల్గొని కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా హోలీ వేడుకల్లో పాల్గొన్న యువత ఉత్సాహం అంతాఇంతా కాదు. చిన్నా, పెద్దా అందరూ కలిసి హోలీ…