అంతా తమనే చేశాడు.. ‘గుంటూరు కారం’లో ఎన్నో విశేషాలు

He did everything himself.. There are many features in 'Guntur Karam'

మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. హీరోయిన్‌ పూజాహెగ్డే బయటకు వెళ్లిపోయింది. తర్వాత తమన్‌ అవుట్‌ అన్నారు. కానీ తమన్‌ దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఆయన పని చేస్తున్నాడు. మూడో వ్యక్తి కెమెరామెన్‌ పి.ఎస్‌ .వినోద్‌ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్‌ వదిలి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థానంలో మనోజ్‌ పరమహంస పనిచేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ చిత్రం అవకాశం ఎలా వచ్చిందో తెలిపారు. ’’ఇన్నేళ్ల జర్నీల్లో అందరు హీరోలతో కలిసి చేస్తున్నావ్‌. మహేశ్‌ బాబు సినిమాకు ఎందుకు పనిచేయట్లేదు’ అని సన్నిహితులు అడిగేవారు. అయితే ఈ చిత్రం నేను చేయడంతో వారందరికీ జవాబు దొరికినట్టే. కెమెరా గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తితో పనిచేయడం ఆనందంగా…