* హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్ను సృష్టించింది. ఈ సినిమా ఈనెల13న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ మీడియా సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ముందు ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఇది కుదరలేదు. తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. కథ విన్నప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని అనుకున్నాను. ఆయన కూడా…
